Rains | రాష్ట్రంలో నేటి నుండి 16వ తేదీ వరకు గాలి వేగం ఏపీలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్రలో గాలులు బాగా వీస్తాయి. తెలంగాణలో గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇవాళ రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే.. తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో 18వ తేదీ వరకూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కర్ణాటక, కేరళకు అత్యంత భారీ వర్షాల హెచ్చరిక కూడా ఉంది.వియత్నాం దగ్గర ఉతిప్ (Utipp) తుపాను.. గంటకు 95 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. అది చైనా వైపుగా కదులుతోంది. మన సంగతి చూస్తే.. ఆస్ట్రేలియా నుంచి గాలులు.. తూర్పు ఆఫ్రికాని టచ్ చేసి.. తిరిగి అరేబియా సముద్రం వైపుగా వచ్చి, కేరళ, కర్ణాటక మీదుగా తెలంగాణ, ఏపీకి వస్తున్నాయి. అక్కడి నుంచి మయన్మార్ వైపు వెళ్లి.. తర్వాత బంగ్లాదేశ్ వైపు వెళ్తున్నాయి. ఈ గాలులు వేగంగా ఉంటాయి. చల్లదనం ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరానికి తగిలితే, విష జ్వరాలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రభావం..
బంగాళాఖాతంలో ఏర్పడిన ఒక ద్రోణి (trough) ఈ వర్షాలకు ప్రధాన కారణం. ఈ ద్రోణి కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలపై ప్రభావం చూపుతోంది. నైరుతి రుతుపవనాలు (మాన్సూన్) ఈ సీజన్లో ఊపందుకోవడంతో, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఈ ద్రోణి జూన్ 12 వరకు కొనసాగే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.ఈ వర్షాలు రైతులకు లాభనష్టాలిద్దరినీ తీసుకొస్తాయి. ఖరీఫ్ పంటలకు నీటి అవసరాలు తీరుతాయి, ముఖ్యంగా వరి, మొక్కజొన్న వంటి పంటలకు ఊతమిస్తాయి. అయితే, ఈదురు గాలులు, భారీ వర్షాలు పంటలకు నష్టం కలిగించే అవకాశం ఉందని సూచించింది. రైతులు నీటి నిల్వను తొలగించే ఏర్పాట్లు చేయాలని APSDMA సిఫార్సు చేసింది.

ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఉంటాయని IMD సూచించింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
Also Read : తల్లికి వందనంలో మీకు డబ్బులు పడలేదా.. అయితే ఇలా చెయ్యండి?