Business | మీకు తెలుసా .. ఈ చిన్న వ్యాపారంతో నెలకు రూ.12 లక్షలు సంపాదన..!!
Business | భారతీయ ఆచారాల్లో దూపం వేయడం అనేది ముఖ్యమైన భాగం. భారతదేశం అగరుబత్తీలకు సంబంధించిన సుగంధ ద్రవ్యాల సరఫరాదారుగా ఉంది. ఈ సువాసనతో కూడిన కూర్పులు అనేక దేవతలను పూజించడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా పూజతో పాటు ధ్యానం సమయంలో ఓ పాజిటివ్ ఎనర్జీ కోసం అగరుబత్తీలను ఉపయోగిస్తారు. ప్రతి ఇంట్లో విరివిగా వాడే ఈ అగరుబత్తీలకు మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో యువత అగరుబత్తీల వ్యాపారంలో అడుగుపెట్టడానికి ఇదే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు.అగరుబత్తీల వెదురు కర్రలతో తయారు చేస్తారు. కర్రకు సహజంగా లభించే సువాసనగల పువ్వులు లేదా గంధం వంటి ఇతర సుగంధ ముద్దలతో పూత పూస్తారు.
దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో అగరుబత్తీలను ఉపయోగిస్తారు. 90కి పైగా దేశాలలో కూడా అగరుబత్తీలను ఉపయోగిస్తారు.ఇటీవల జార్ఖండ్ లో ఒక వ్యక్తి లక్ష్మీ గ్రూప్ పేరుతో పవన్ కుమార్ అనే వ్యక్తి అగర్బత్తి ల తయారీలను మొదలుపెట్టి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.. అగర్బత్తీలు చేయడం ద్వారా తమ జీవితాన్ని మార్చేసిందని చాలామంది మహిళలు కూడా తెలియజేస్తున్నారు.పవన్ కుమార్ తండ్రి దగ్గర ఎక్కువగా వ్యాపార కలలు నేర్చుకొని.. ఆ తర్వాత తన వ్యాపారాన్ని ప్రారంభించారట. తన తండ్రి వినోద్ ప్రసాద్ స్వీట్స్ ఇతరత్రాహార సంబంధిత వ్యాపారాలను నడిపే వారని ఆ తర్వాత పవన్ కుమార్ కూడా అగర్బత్తుల వ్యాపారంలో అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకున్నారు.

పవన్ కుమార్ 21 ఏళ్ల క్రితం తన ఇంట్లోనే ఈ అగర్బత్తుల వ్యాపారాన్ని మొదలుపెట్టగా అతి తక్కువ పరిమాణంలో తయారుచేసి మార్కెట్లోకి వెళ్లి విక్రయించేవారు.ఆ తర్వాత నెమ్మదిగా స్థానిక పట్టణం నుంచి జిల్లాల వారీగా కూడా అగర్బత్తులను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు రోజుకి 300కు పైగా డజన్ల అగర్బత్తులను తయారు చేస్తూ అమ్ముతున్నారట.. అలా ప్రస్తుతం ఝార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వరకు తన అగర్బత్తూరు వెళుతున్నాయని దీనివల్ల ప్రతినెల 12 నుంచి 15 లక్షలు విలువైన అగరబత్తులను అమ్మేస్తున్నారట. ఈయన కంపెనీలు 8 మంది మహిళలు పనిచేస్తున్నారని తెలిపారు.
300సినిమాలు 5 పెళ్లిళ్లు.. చివరికి అన్నం కూడా లేక దిక్కులేని చావు..










