Sravanthi | ఆ క్షణం నాప్రాణం పోయింది.. యాంకర్ స్రవంతి
Sravanthi | హీరోయిన్స్ తో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న బుల్లితెర యాంకర్ స్రవంతి చొక్కారపు. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం హోస్టుగా ఫుల్ బిజీగా కెరీర్ సాగిస్తోంది. ఇన్నాళ్లూ యాంకర్ గా తన మాటలతో అలరించిన స్రవంతి.. ఇప్పుడు నటిగా వెండితెరపైకి వస్తోంది. సుహాస్ హీరోగా నటించిన ‘హే భగవాన్’ అనే సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించింది. ఫిబ్రవరి 20న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

మూవీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ 2021లో ‘విరూపాక్ష’ ప్రమోషన్స్ కి నేనూ, సాయి ధరమ్ తేజ్, సినిమా టీమ్ అంతా కలిసి ఆంధ్రా సైడ్ వెళ్లాం. వందే భారత్ ట్రైన్ లో వెళ్లాం. నేనొక్కదాన్నే అమ్మాయిని.. మిగతా అందరూ అబ్బాయిలు.అక్కడికి వెళ్లాక 500-600 మంది క్రౌడ్ నన్ను చుట్టు ముట్టేశారు. నేను అప్పుడు చుడీదార్ వేసుకొని నీట్ గా ఉన్నాను. అయినా అందరూ నా మీద పడిపోయారు. బట్టలతో సంబంధం లేదు. ఆ రోజు సాయి ధరమ్ తేజ్ లేకపోతే ఏమయ్యేదో అని భయపడ్డాను. దీని గురించి అప్పట్లో ట్వీట్ కూడా చేశాను. ఆయన నన్ను చాలా ప్రొటెక్ట్ చేసారు. నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లి కారు ఎక్కించారు.
గ్లామరస్ పిక్స్ ..

అక్కడి నుంచి బయటకు రావడానికి అర్థ గంట పట్టింది. అబ్బాయిలు నన్ను చుట్టుముట్టగా.. నన్ను ప్రొటెక్ట్ చేస్తూ తీసుకొచ్చారు. అందమందిలో సాయి తేజ్ లాంటి మంచి అబ్బాయిలు కూడా ఉంటారు” అని చెప్పింది.ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఓ రేంజ్లో ఉంటుంది. కేక పుట్టించే అందాలతో కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ కేక పెట్టిస్తుంది.
యాంకర్ స్రవంతి గ్లామర్ షో కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా వీకెండ్ వస్తే చాలు స్రవంతి ఫొటోషూట్లు మాములుగా ఉండవు. ఇక తాజాగా ఈ బ్యూటీ థాయ్లాండ్ వెకేషన్లో చిల్ అవుతుంది. అక్కడ తీసుకున్న ఫొటోలని షేర్ చేసి నెటిజన్స్ మైమరిచిపోయేలా చేస్తుంది. తాజాగా తన ఇన్స్టాలో స్రవంతి కొన్ని పిక్స్ షేర్ చేయగా, ఇందులో స్రవంతి గ్లామర్ ట్రీట్కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
.










