Ahmedabad Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. ఈ జంట కధ తెలిస్తే కన్నీరు పెట్టాల్సిందే ,

Ahmedabad Plane Crash | గురువారం మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం ఏఐ 171, గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే మేఘాని నగర్ ప్రాంతంలోని ఒక మెడికల్ హాస్టల్‌పై కుప్పకూలిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒకరు మినహా అందరూ, విమానం కూలిన ప్రదేశంలోని హాస్టల్‌లో ఉన్న మరో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, పైలట్ చివరి క్షణంలో చాకచక్యంగా వ్యవహరించడం వల్లే, విమానం జనసాంద్రత అధికంగా ఉండే నివాస ప్రాంతాలపై పడకుండా, పెను విషాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని, ఆకాశంలోకి అగ్నికీలలు ఎగిసిపడ్డాయని స్థానికులు తెలిపారు. సివిల్ హాస్పిటల్ క్యాంపస్‌ మీదుగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.

ఈ నేపథ్యంలోనే విమాన ప్రమాదంలో మరణించిన ఓ కుటుంబానికి సంబంధించిన విషయం వెలుగు చూసింది. అది గుండెలను కదిలించేస్తోంది అదేమిటి అంటే.అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 37 ఏళ్ల జావేద్ అలీ సయ్యద్ (Javed Ali Syed) అతడి భార్య మరియమ్ (Mariam), ఐదేళ్ల కుమారుడు జాన్ అలీ సయ్యద్ (Zayn Ali Syed) (5), నాలుగేళ్ల కూతురు అమని అలీ సయ్యద్ (Amani Ali Syed) ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తన అన్న బాడీ కోసం అహ్మాదాబాద్ సివిల్ ఆస్పత్రికి వచ్చిన తమ్మడు ఇంతియాజ్ (Imtiaz).. హృదయ విదారక విషయాలను మీడియాతో పంచుకున్నారు. తన తల్లికి జావేద్ మరణించిన విషయం ఇంకా తెలియదని పేర్కొన్నారు. ఆమె హార్ట్ పెషంట్ అన్న ఇంతియాజ్.. త్వరలో సర్జరీ ఉన్నందున ఈ విషయాన్ని తన తల్లి వద్ద దాచినట్లు చెప్పారు.జావేద్ 11 ఏళ్ల క్రితం లండన్ వెళ్లి అక్కడే మరియమ్ ను కలిశాడని చెప్పారు.

Javed Ali Syed
Javed Ali Syed

ప్రస్తుతం వారికి యూకే సిటిజన్ షిప్ కూడా ఉందని పేర్కొన్నారు. అయితే జావేద్ ఇండియాకు రావడానికి ఓ బలమైన కారణముందని సోదరుడు ఇంతియాజ్ స్పష్టం చేశాడు. తాము మెుత్తం నలుగురు సోదరులమని.. ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారని తెలిపారు. తామంతా బక్రీద్ సందర్భంగా ఒకచోట చేరి తల్లితో పాటు పండగను సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అందరం 15 ఏళ్ల తర్వాత రీ యూనియన్ అవుతుండటంతో జావేద్ కూడా ఎంతో సంతోషంగా భార్య, పిల్లలతో ఇండియాకు వచ్చాడని పేర్కొన్నారు. ఈద్ పండగను ఎంతో సంతోషంగా జరుపుకున్నామని.. జావేద్ ఫ్యామిలీ చాలా ఆనందంగా గడిపిందని పేర్కొన్నారు. తిరిగి లండన్ కు తిరుగు ప్రయాణమైన సమయంలో ఈ దుర్ఘటన జరగడం.. తమను ఎంతో వేదనకు గురిచేస్తోందని ఇంతియాజ్ కన్నీటి పర్యంతమయ్యారు.

Ahmedabad Plane Crash
Ahmedabad Plane Crash

ప్రత్యక్ష సాక్షి.. “ప్రమాదం జరిగినప్పుడు మేము క్రికెట్ ఆడుకుంటున్నాం. విమానం మా పైనుంచే, చాలా దగ్గరగా వెళ్లింది” అని ఘటనను కళ్లారా చూసిన ఒక స్థానికుడు సీఎన్ఎన్-న్యూస్18కి తెలిపారు. “ప్రమాదం తర్వాత అంతా గందరగోళంగా మారింది. మేమంతా వెంటనే సంఘటనా స్థలానికి పరిగెత్తుకెళ్లి, సుమారు 15 నుంచి 20 మందిని రక్షించగలిగాం. సాధారణంగా విమానాలు చాలా ఎత్తులో వెళ్తాయి. కానీ ఇది ఇళ్లకు చాలా దగ్గరగా వచ్చింది. జనావాసాలపై పడకుండా విమానాన్ని పక్కకు మళ్లించిన పైలట్‌కు సెల్యూట్ చేయాలి. లేకపోతే సుమారు 1,500 నుంచి 2,000 మంది చనిపోయేవారు” అని ఆయన తెలిపారు.

Leave a Comment