Sai Baba | మహారాష్ట్రలోని షిర్డీ సాయి బాబా దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు షిర్డీ సాయి దర్శనం కోసం వెళ్తుంటారు. ఇక నూతన సంవత్సరం సందర్భంగా షిర్డీ సాయిబాబా ఆలయాన్ని డిసెంబర్ 31వ తేదీ రాత్రి అంతా తెరిచే ఉంచారు. భక్తుల దర్శనం కోసం రాత్రి మొత్తం ఆలయం తెరిచే ఉంచారు. నూతన సంవత్సరం సందర్భంగా షిర్డీ సాయిబాబా సంస్థాన్ డిసెంబరు 29, 2024 నుంచి జనవరి ఒకటో తేదీ వరకూ నాలుగు రోజుల పాటు షిర్డీ మహోత్సవ్ను నిర్వహించింది.

ఇక సాయి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ ప్రాంగణం, సాయి ధర్మశాల, భకత్నివస్థాన్లో షిర్డీ సాయి సంస్థాన్ 34,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మంటపం ఏర్పాటు చేసింది.నిజానికి సాయిబాబా ఒక ముస్లిమా అని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు.
అతని అసలు పేరు, పుట్టిన స్థలం తెలియదు. అయితే, అతనిని హిందువులు, ముస్లిములు ఇద్దరూ గౌరవిస్తారు, అతని బోధనలు మతాల మధ్య సమైక్యతను ప్రోత్సహిస్తాయని నమ్ముతారు. కొంతమంది సాయిబాబాను ముస్లిం సాధువుగా భావిస్తారు, కానీ అతని మతం ఏమిటో చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు.