రూ.500 నోటు రద్దు? RBI సన్నాహాలు! ముద్రణ ఖర్చును తగ్గించాలని
రూ.500 నోటు రద్దు? RBI సన్నాహాలు! ముద్రణ ఖర్చును తగ్గించాలని

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 సెప్టెంబరు నాటికి దేశంలోని 75 శాతం ATM లలో రూ.100, రూ.200 నోట్లను అందుబాటులో ఉంచాలని బ్యాంకులను ఆదేశించింది.
ఈ నిర్ణయం రూ.500 నోటు పై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ATMలలో సెప్టెంబర్ 2025 నాటికి 100, 200 రూపాయల నోట్లను అప్లోడ్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని బ్యాంకులను ఆదేశించింది. RBI చేసిన ఈ సూచన తర్వాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.500 నోటుపై ఆధారపడటాన్ని తగ్గించాలని, దీంతో రూ.500 రూపాయల నోటును కూడా రద్దు చేస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ అంశంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఇండియాలో డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరిగాయని, డిజిటల్ కరెన్సీ ఈ-రూపాయిని ప్రవేశపెట్టడానికి ఆర్బిఐ సన్నాహాలు చేస్తోందని రాణా అన్నారు. అటువంటి పరిస్థితిలో రిజర్వ్ బ్యాంక్ కూడా కరెన్సీ ముద్రణ ఖర్చును తగ్గించాలని కోరుకుంటుంది. నిజానికి, ప్రభుత్వం నోట్ల ముద్రణకు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
అందువల్ల, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్న నోట్లను ATMలలో ఎక్కువ చెలామణిలోకి తీసుకురావాలని కోరుకుంటోంది. రూ.2000 నోటు లానే రూ.500 నోటు సరఫరాను క్రమంగా ఆర్బీఐ తగ్గించాలని భావిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు.
What's Your Reaction?






