ఏపీ: పాక్ ఉగ్రవాదుల కదలికలు! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ

ఏపీ: పాక్ ఉగ్రవాదుల కదలికలు! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ-ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో, రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిఘా

May 19, 2025 - 23:38
May 19, 2025 - 23:50
 0  175
ఏపీ: పాక్ ఉగ్రవాదుల కదలికలు! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ
ఏపీ: పాక్ ఉగ్రవాదుల కదలికలు! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ

AP State News: (ఏపీ: పాక్ ఉగ్రవాదుల కదలికలు! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ) ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రవాద కదలికలపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి లేఖ రాశారు.ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి లేఖ రాశారు.

ఆపరేషన్ సింధూర్ తర్వాత రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్ ఉనికిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

విజయనగరంలో ఐసిస్‌తో సంబంధాలున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలి.పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారతదేశం ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో, రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిఘా ఉంచాలని పేర్కొన్నారు. అదే సమయంలో, తీరప్రాంతాల్లో ఉన్న జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు.

ఉగ్రవాద కదలికలపై నిరంతర నిఘా అవసరమని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ గుప్తాకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక లేఖలు రాశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News