తిరుమలలో కీలక పరిణామం! విచారణలో మాజీ చైర్మన్ పీఏ
తిరుమలలో కీలక పరిణామం! విచారణలో మాజీ చైర్మన్ పీఏ

తిరుమలలో గత ప్రభుత్వ పాలనలో జరిగిన స్వామి వారి లడ్డు ప్రసాదం కల్తీ జరిగిన విషయం తెలిసిందే. టీటీడీ మాజీ చైర్మన్ పీఏ ను విచారిస్తున్న సిట్ అధికారులు. రెండు రోజుల నుంచి సిట్ అధికారులు అప్పన్నను ప్రశ్నిస్తున్నారు. అప్పన్నతో పాటు మరో ఆరుగురు తిరుమల ఉద్యోగులను సిట్ విచారిస్తోంది. వారితో కలిపి అప్పన్నను సిట్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
కాగా తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసిన డెయిరీ యజమానులు, టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. కల్తీ నెయ్యి సరఫరాలో ఉత్తరాఖండ్ బోలెబాబా డెయిరీ జీఎం హరిమోహన్ రానా కీలకపాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో 12వ నిందితుడిగా ఉన్న హరి మోహన్ను మార్చి 20న సిట్ అరెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న. అలాగే ఉద్యోగుల విచారణ కీలకంగా మారింది.
What's Your Reaction?






