తిరుమలలో చిరుత కలకలం! భయాందోళనలో భక్తులు

తిరుమలలో చిరుత కలకలం! భయాందోళనలో భక్తులు

Jun 1, 2025 - 18:59
Jun 1, 2025 - 19:21
 0  333
తిరుమలలో చిరుత కలకలం! భయాందోళనలో భక్తులు
తిరుమలలో చిరుత కలకలం! భయాందోళనలో భక్తులు

తిరుమలలో మళ్లీ చిరుత పులి సంచారం కలకలం రేపింది. చిరుతను చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. తితిదే అధికారులు, అటవీ శాఖ అధికారులు అప్రమత్తతతో స్పందించారు. 500వ మెట్టు వద్ద చిరుత చెట్ల పొదల్లో ఉన్నట్లు భక్తులు తెలిపారు. భక్తుల నుండి సమాచారం అందుకున్న సిబ్బంది, సైరన్ మోతతో చిరుతను తరిమేశారని వార్తలు వచ్చాయి, అయితే అధికారులు ఈ వార్తలను ఖండించారు.

చిరుత సంచారం భక్తుల భద్రతకు భయం కలిగిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆంక్షలు విధించింది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం ఉన్నట్లు గుర్తించారు. భక్తుల కోసం అధికారులు అనేక మార్గదర్శకాలను జారీ చేశారు. అటవీ శాఖ అధికారులు ఘాట్ రోడ్డులో చిరుత అటువైపు రాకుండా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఆదివారం ఉదయం చిరుత సంచరించిందనే వార్తలు అవాస్తవమని అటవీ శాఖ MRO దొరైస్వామి తెలిపారు.

చిరుత సంచరించినట్లు జరిగిన ప్రచారం తప్పుడు సమాచారంగా తేల్చారు. ఈ మార్గంలో చిరుత రాలేదని స్పష్టం చేశారు. భక్తులు యథావిధిగా దర్శనాలకు వెళ్తున్నట్లు తెలిపారు. మరోవైపు శనివారం సాయంత్రం సుమారు 5.30 గంటలకు శిలాతోరణం వద్ద చిరుత కనిపించిందని.. తరువాత అది అడవుల్లోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News