దూసుకొస్తున్న తుఫాన్! బంగాళాఖాతంలో మరో వాయుగుండం
దూసుకొస్తున్న తుఫాన్! బంగాళాఖాతంలో మరో వాయుగుండం

తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. (దూసుకొస్తున్న తుఫాన్! బంగాళాఖాతంలో మరో వాయుగుండం). రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఉరుములు, ఈదురు గాలులు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. అలాగే దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. సముద్ర తీరం వెంట కోస్తా జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని న వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై శక్తి తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం దాటి ఉత్తరం వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే రెండు రోజుల్లో ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదవుతాయని అధికారులు ప్రకటించారు.
కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రభావం ఏడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు,టవర్స్,పోల్స్, పొలాలు,బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి. -ఏపీ విపత్తుల సంస్థ
What's Your Reaction?






