హైదరాబాద్ పబ్ లో దారుణ ఘటన! లైట్లు ఆపి తల్లి, కూతుర్ని
హైదరాబాద్ పబ్ లో దారుణ ఘటన! లైట్లు ఆపి తల్లి, కూతుర్ని

జూబ్లీహిల్స్ లోని బేబీలాన్ పబ్ లో దారుణ ఘటన తాను ఆర్డర్ చేసిన డ్రింక్స్ బిల్ చేశారని ప్రశ్నించినందుకు సిబ్బంది కస్టమర్లపై దాడికి చేసారు పబ్ ఓనర్. పబ్లో లైట్లు ఆర్పి తన తల్లి, చెల్లిపై దాడి చేశారని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మీనల్ మీను ఆరోపిస్తోంది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ మీనల్మీను మంగళవారం రాత్రి తన తల్లి, చెల్లితో కలిసి జూబ్లీహిల్స్ లోని బేబీలాన్ పబ్ కు వెళ్లింది. ఈ సందర్భంగా తాము తాగని డ్రింక్స్కు కూడా బిల్లు వేసినట్లు గుర్తించిన ఆమె పబ్ సిబ్బందిని ప్రశ్నంచింది. దీంతో వారితో గొడవకు దిగిన దిగిన పబ్ ఓనర్స్ సిబ్బందితో కలిసి పబ్లో లైట్లు ఆపేసి ఆమె తల్లి, చెల్లిపై దాడికి పాల్పడ్డారు.
హైదరాబాద్ పబ్ లో దారుణ ఘటన! లైట్లు ఆపి తల్లి, కూతుర్ని pic.twitter.com/t1xBthvgvy — RMB Live News (@darsi_live) May 30, 2025
ఈ దాడిపై ఆమె సోషల్ మీడియా వేదికగా వివరించింది. తాము ఆర్డర్ చేయని డ్రింక్స్కు బిల్ వేశారని అడిగినందుకు కొట్టారని, వీడియో తీస్తుంటే బెదిరించి లైట్లు ఆర్పేసి దాడి చేశారని పేర్కొంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే పలువురు సిబ్బందిని విచారించారు. దాడికి పాల్పడింది బౌన్సర్లా..? సిబ్బందా అన్న దానిపై విచారణ కొనసాగుతోంది.
What's Your Reaction?






